సాగునీరు అందడం లేదు..
ఆండ్ర రిజర్వాయర్ నుంచి మా గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు భారంగా మారింది. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. పాతబగ్గాం గ్రామం నుంచి 10 చెరువులకు పారే సాగునీటి కాలువ కూడా లీకులకు గురికావడంతో పొలాలకు నీరు చేరడం లేదు. మా గ్రామం తర్వాత మరో పది గ్రామాలకు కూడా ఆండ్ర కెనాల్ కాలువ నుంచి సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జగన్మోహన్రెడ్డికి తెలియజేయడానికి వచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు. – మధుపాడ రైతులు