వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా లంకా శ్రీధర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లంకా శ్రీధర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాన్ని చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.