నవరత్నాలు విజయానికి సోపానాలు
తూర్పుగోదావరి :వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు విజయానికి సోపానాలని జగన్నాథపురానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు లెక్కల సోమినాయుడు అన్నారు. పాదయాత్రగా జగన్నాథపురం క్రాస్కు వచ్చిన జగన్ను కలుసుకుని నవరత్నాలపై రచించిన గేయాన్ని అందించారు. అలాగే పెన్షనర్ల హెల్త్ కార్డులో కుటుంబ సభ్యులను చేర్చి అందరికీ వైద్యం అందేలా చూడాలని, స్థలం మంజూరు చేయడంతో పాటు గృహాన్ని నిర్మించాలని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతి కల్పించి సమస్యల పరిష్కారం వెంటనే జరిగేలా చూడాలని, పెన్షనర్ల జీతభత్యంపై ఆదాయపు పన్ను లేకుండా చూడాలని, ప్రాంతీయ విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందించారు. జగన్ సీఎం అయిన తరువాత ఈ సమస్యలు పరిష్కరిస్తారని తమకు నమ్మకం ఉందన్నారు.