కులవృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తాం: వైఎస్‌ జగన్‌

 My priority will be to protect this endangered craft:YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాల అభ్యున్నతే మా ప్రాధాన్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. 12వరోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కుమ్మరి శిల్పకారులతో ముచ్చటించిన వైఎస్‌ జగన్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారిని కలిసిన ఫోటోకు క్యాప్షన్‌గా ‘ ప్రజాసంకల్పయాత్రలో శిల్పకారులను కలిసినందుకు ఆనందంగా ఉంది. అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడటమే మా ప్రాధాన్యత. వారి కుటుంబాల అభ్యున్నతి కోసం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా తోడ్పాటునందిస్తాం.’  అని ట్వీట్‌ చేశారు. ఇక వైఎస్‌ జగన్‌ 12వ రోజు పాదయాత్ర బనగానపల్లిలో ముగిసింది. సౌదరదిన్నె నుంచి బనగానపల్లి వరకు ఆదివారం 15.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top