నా కుమార్తె పింఛన్ ఆపేశారన్నా...
నా అక్క కుమార్తెకు కంటి చూపు లేదన్నా...మూడేళ్లుగా ఇస్తున్న పింఛన్ ఆపేశారన్నా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమని కక్ష కట్టి మరీ నా అక్క కుమార్తెకు పింఛన్ తీసేశారు. నా అక్క ఐదేళ్ల కిందటే మృతి చెందింది. తండ్రి కుమార్తెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్క కుమార్తె సాధకబాధకాలను నేనే చూస్తున్నా...పింఛన్ పునరుద్ధరించాలని ప్రతి సమావేశంలో దరఖాస్తు చేస్తున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వే మమ్మల్ని ఆదుకోవాలన్నా...
–కుమిలి సత్యవతి, శ్రీరంగరాజపురం