ఆదుకోవాలన్నా..
తూర్పుగోదావరి : రాజీవ్ స్వగృహలో అర్హులైన వారికి నేటికీ ఇళ్లు ఇవ్వలేదని కాకినాడకు చెందిన రాజీవ్ స్వగృహ బాధితులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. షేక్ పర్వీన్ మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ పేరిట నాన్ డూప్లెక్స్కు రూ.7.50లక్షలు, డూప్లెక్స్కు 12.50 లక్షలు చొప్పున అప్పటి ప్రభుత్వం ఎస్బీఐ, గృహ నిర్మాణ శాఖ ద్వారా తక్కువ వడ్డీకే గృహ రుణాలిచ్చారని, వాటికి సంబంధించి నాలుగో వంతు చెల్లింపులు చేసినా ఇల్లు అప్పగించలేదని జగన్కు వివరించింది.
సంబంధిత వార్తలు