ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నా..

Muslim Leaders Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘‘రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నా.. ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి’’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముస్లిం నాయకులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో వైఎస్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఎండీఏ ఖాన్, ఏకే జిలానీ, కరీంఖాన్, అహ్మద ఖాన్‌లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. పడవ ప్రమాదాలను అరికట్టి గోదావరి నదిపై అవసరం మేరకు వంతెనలు నిర్మించాలన్నారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top