ప్రేమ కురిపించిన అందిరికీ కృతజ్ఞతలు
సాక్షి, విశాఖపట్నం: దాదాపు 11 నెలలనుంచి మండుటెం డను, వానలను లెక్కచేయకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ జగన్ చేపట్టిన పాదయాత్రను విశాఖ ప్రజలు ఎంతో అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. విశాఖ చరిత్రలో ఇంతలా జనప్రభంజనం మధ్య సభ జరిగిన తీరును నమ్మలేకపోతున్నా. కంచరపాలెంలో జరిగిన బహిరంగ సభను వర్ణించడానికి మాటలు సరిపోవు. జగన్పై ప్రేమానురాగాలు కురిపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.– మళ్ల విజయప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు