పాప అనారోగ్యంతో ఎన్నో బాధలు

Mother Share Her Daughter Illness With YS Jagan - Sakshi

విశాఖపట్నం :‘మాకు ఇద్దరు పిల్లలు. చిన్న పాప షర్మిలకు మూడున్నరేళ్లు. పాప పుట్టిన ఐదు నెలల తరువాత పాపకు ఆరోగ్యం బాగులేకపోతే విశాఖలో కేజీహెచ్‌కు తీసుకెళ్లాం. పాపకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చిందని డాక్టర్‌ చెప్పారు. అప్పటి నుంచి ప్రతి మూడునెలలకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం.’అని పెందుర్తి మండలం నందవరపువాని పాలేనికి చెందిన మంగ జగన్‌కు చెప్పింది. ఈ సమస్య వల్ల ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, పాపకు ఆరోగ్యం బాగుపడేలా చూడమని కోరింది. సాయమందేలా చూస్తానని జననేత చెప్పడంతో ఊరట చెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top