తల్లడిల్లిన తల్లి హృదయం

Mother Complete Son Funeral Program in Srikakulam - Sakshi

కుమారుడి చితికి మాతృమూర్తి దహన సంస్కారాలు

శ్రీకాకుళం, పలాస: తల్లి హృదయం తల్లడిల్లింది. ఒక్కగానొక్క కుమారుడు తనకు తలకొరివి పెడతాడనుకుంటే తానే కుమారిడి చితికి నిప్పుపెట్టాల్సి వచ్చిందని ఆ మాతృమూర్తి రోదన అందరిచేత కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పలాస మండలం టెక్కలిపట్నంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన నార్ల బుచ్చిబాబు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకొని జీవిస్తుండేవాడు.  భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి నార్ల పార్వతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. బుచ్చిబాబు గత కొంత కాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. పేదరికం వల్ల సరైన వైద్య చేయించుకోలేక మంచం పట్టాడు. తన ఇంటిలోనే ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రి చాలా క్రితం మృతి చెందారు. తల్లి పార్వతి దహన సంస్కారాలు చేసింది. ఈ సంఘటన చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top