గుహలోకి వెళ్లి తల్లి, కొడుకు మృతి

Mother And Son Dead In Kadapa District - Sakshi

సాక్షి, పెండ్లిమర్రి: మండలంలోని యాదవాపురం గ్రామానికి చెందిన మల్లమ్మ(50), లక్షుమయ్య(22) పిట్టల ఎరువు కొసం గుహలోకి వెళ్లి ఊపిరాడక మంగళవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవాపురం గ్రామంలో ఉన్న యానాదులు మల్లమ్మ, లక్షుమయ్య పెద్దదాసరిపల్లె గ్రామ పొలాల్లోని బోడబండ గుట్టలల్లో ఉన్న గుహలోకి వెళ్లారు.ఎంతసేపటికి వీరు రాకపోడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి కావడంతో మృతదేహాలను వెలికి తీయలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top