ఏపీలో 2944కు చేరిన కరోనా కేసులు

More 70 Coronavirus Positive Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2944కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,504 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 70 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శనివారం కొత్తగా 55 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 2092కి చేరగా, మృతుల సంఖ్య 60గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 792 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా చిత్తూరు నుంచి నమోదైన కరోనా కేసుల్లో ముగ్గురు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవారు ఉన్నారు.
జడ్చర్లలో కరోనా కలకలం?
కరోనా ఎఫెక్ట్‌: మెట్రో కీలక నిర్ణయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top