కాంట్రాక్టర్లతో మంత్రి కుమ్మక్కు
శ్రీకాకుళం :‘అన్నా.. దివంగత వైఎస్ హయాంలో రూ.127 కోట్లతో రేగులపాడు వద్ద మహేం ద్రతనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టింది’ అని నందిగాం ఎంపీపీ యర్రా విశ్వశాం తి, పలాస జెడ్పీటీసీ పేడాడ భార్గవి జగన్కు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రూ.466 కోట్లకు అంచనాలు పెంచేశారని తెలిపారు.