రెగ్యులర్ చేయాలని వినతి
వైద్య ఆరోగ్య శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయడం లేదు. 2008, 2009లో 380 మంది రెండో ఏఎన్ఎంలుగా నియమితులయ్యాం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం, నెలకు రూ.17 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. వేతనాలు మినహా టీఏ, డీఏ, యూనిఫారమ్, టాబ్ వర్క్ అలవెన్సులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈఫీఎఫ్ కట్ చేస్తున్నా వివరాలు చెప్పడం లేదు. తమకు న్యాయం చేయాలని ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి కోరాం.
– సెకండ్ ఏఎన్ఎంలు