వివక్ష చూపుతున్నారన్నా..
తూర్పుగోదావరి : ‘‘వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని చూపుతున్నందుకు మాపై వివక్ష చూపుతున్నారన్నా’’ అంటూ ఊలపల్లికి చెందిన యాదల స్వాతి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయ్యి ఏడేళ్లయ్యిందని, ఇప్పటి వరకూ ప్రభుత్వ లబ్ధి పొందలేదని, జన్మభూమిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయలేదని జననేతను పాదయాత్రలో కలిసి విన్నవించింది. ‘‘నా సమస్యను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పరిష్కరించాలి’’ అంటూ జగన్ను కోరింది.
సంబంధిత వార్తలు