నక్సల్స్ పోస్టర్‌పై కలకలం

నక్సల్స్ పోస్టర్‌పై కలకలం - Sakshi


మాచర్లటౌన్ : నక్సల్స్ హెచ్ఛరిక పేరుతో చేతితో రాసిన పోస్టర్‌ను జన సంచారం కలిగిన అంబేద్కర్ పార్క్ ముఖద్వార గోడకు శనివారం సాయంత్రం అంటించారు. ఉన్నత సామాజిక వర్గాలను, పోలీసులను హెచ్ఛరించేలా ఈ పోస్టర్ ఉండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రాంతంలోని హోంగార్డు ఆ పోస్టర్‌ను చించుకొని వెళ్లిపోయాడు. పోస్టర్‌లో వచ్చీరాని తెలుగుతో అక్షరాలను రాశారు. ‘మీ అన్నలుగా చెబుతున్నాం.. ఏమనగా.. ఎక్కడా లేని వ్యవహరాలు మన పల్నాడు ప్రాంతంలో అదీ మాచర్ల పరిధిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది.



లేబర్‌కు న్యాయం జరగటం లేదు. మూడు సామాజిక వర్గాల వారు రాజకీయనక్సల్స్ హెచ్ఛరిక పేరుతో చేతితో రాసిన పోస్టర్‌ను జన సంచారం కలిగిన అంబేద్కర్ పార్క్ ముఖద్వార గోడకు శనివారం సాయంత్రం అంటించారు. అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. మేము లేమని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఎక్కువ చేస్తున్నారు. రాజకీయం, రౌడీయిజంతో భూదందాలు చేస్తున్నారు. మేము ఎవరో ఒకరిని బలిచేసే దాకా మీరే ఇలానే వ్యవహరిస్తారా ... జాగ్రత్త. పోలీసులూ మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం’ అంటూ పేరు, ఊరు ఏమీ లేకుండా పోస్టర్‌ను అంటించారు. పోస్టర్ విషయం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఇది నక్సలైట్ల పనా.. లేక నకిలీల పనాని పోలీసుల ఆరా తీస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top