ట్రాక్టర్ బోల్తా-వ్యక్తి మృతి
దమ్మపేట(ఖమ్మం) : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని నెమలిపేట గ్రామ సమీపంలో జరిగింది. దమ్మపేట మండల కేంద్రం నుంచి గురువాయిగూడెం వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ఘటనలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న పాల్వంచకు చెందిన వెంకటేష్(30) అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం కోసం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.