మహానేత వైఎస్సార్కు మమత నివాళి
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు.
మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా రాజకీయ నాయకులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మహానేత పేదలకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Tribute to YS Rajasekhara Reddy, former chief minister of Andhra Pradesh, on his birth anniversary @ysjagan
অন্ধ্র প্রদেশের প্রাক্তন মুখ্যমন্ত্রী ওয়াই এস রাজশেখর রেড্ডির জন্মবার্ষিকীতে শ্রদ্ধার্ঘ্য
— Mamata Banerjee (@MamataOfficial) July 8, 2019