మహానేత వైఎస్సార్‌కు మమత నివాళి

Mamata Banerjee Pays Tribute To YS Rajashekar Reddy On Twitter - Sakshi

హైదరాబాద్‌ : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

మరోవైపు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రాజకీయ నాయకులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మహానేత పేదలకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోని వైఎస్సార్‌ అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top