ప్రేమకథ సుఖాంతం
కర్నూలు, కోవెలకుంట్ల: మండలంలోని రేవనూరు గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట సోమవారం పోలీసులను ఆశ్రయించింది. గ్రామానికి చెందిన సురేష్ కుమారుడు దుర్గా ఉశేని, ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమార్తె కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇటీవల ఆళ్లగడ్డ మండలం కాశీచింతల పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, రేవనూరు ఎస్ఐ సత్యనారాయణను ఆశ్రయించారు. వివాహం చేసుకున్న యువతీ, యువకులు మేజర్లు కావడంతో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని ఒప్పించడంతో ప్రేమకథ సుఖాంతమైంది.