పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Love Couple Asking Protect From Parents To Police - Sakshi

జి. కొండూరు (మైలవరం) : ప్రేమ వివాహం చేసుకొని తమకు రక్షణ కావాలంటూ జి. కొండూరు పోలీసులను ఓ జంట సోమవారం రాత్రి ఆశ్రయించింది. ఏఎస్‌ఐ రామారావు వివరాల ప్రకారం... జి. కొండూరు మండల పరిధిలోని వెలగలేరు గ్రామానికి చెందిన కనుమూరి విరాట్‌కుమార్‌ (24) అనే విజయవాడ గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోలో అప్రంటీస్‌గా పని చేస్తున్నాడు. ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామానికి చెందిన జొన్నల శ్రీసౌజన్య (21) బీటెక్‌ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. చదువుకునే రోజుల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో చేసేది లేక ఇద్దరూ సోమవారం మధ్యాహ్నం తాడేపల్లి మండలం సీతానగరంలోని షిర్టీ సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించమంటూ జి. కొండూరు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని ఏఎస్‌ఐ రామారావు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top