జగన్‌తోనే పంచ గ్రామాల భూ సమస్యకు పరిష్కారం

Land Issue Solve With YS Jagan Only - Sakshi

సాక్షి, విశాఖపట్నం :వైకానశి పీఠం పండితులు వేసిన రాష్ట్రవ్యాప్త దేవాలయ భూముల ఆక్రమణ కేసులో సింహాచలం భూములను చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు. రికార్డుల ప్రకారం సుమారు 1800 ఎకరాలు జిరాయితీగా ఉన్నాయి. సుమారు లక్ష మంది జనాభా కలిగిన ఐదు గ్రామాల ప్రజలందరం.. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన ఈ భూముల్లో జీవిస్తున్నాం. మా హక్కులపై గతంలో టీడీపీ ఇబ్బంది పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వల్లే మా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఆయన్ని కలసి మా సమస్యను వివరించాం.– సింహాచలం పంచ గ్రామాల బాధితులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top