మా భూమిని లాగేసుకుంటున్నారు
సాక్షి, విశాఖపట్నం:మాది నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు. పూర్వీకుల నుంచి సుమారు 300 ఎకరాలను సాగు చేసుకుం టున్నాం. మాకు డి.పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములను టీడీపీ ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. అడ్డుకుంటే మమ్మల్ని, మా కుటుంబాలను బెదిరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్నారు. ఎవర్ని ఆశ్రయించినా న్యాయం జరగడం లేదు. మీరే న్యాయం చేయాలని కోరాం. తప్పక న్యాయం చేస్తానన్నారు.– పెదదొడ్డిగల్లు గ్రామస్తులు