తొయ్యండహె..
కర్నూలు : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్బాషా వినూత్నరీతిలో శిక్ష విధించారు. బుధవారం నగరంలోని ఉల్చాల సర్కిల్ వద్ద అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 45 మంది వాహన దారులను అదుపులోకి తీసుకుని కొద్ది సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత ఉల్చాల జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వారితోనే వాహనాలను తోయిస్తూ తీసుకెళ్లారు. అనంతరం వాహనాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.