ఔదార్యం చాటుకున్న మంత్రి కురుసాల
సాక్షి, తూర్పుగోదావరి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహయం అందించి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తన ఔదార్యం చాటుకున్నారు. కాకినాడ రూరల్ తూరంగి వద్ద అదుపు తప్పి ఫ్లైఓవర్ పిల్లర్ను శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు ఢీ కొట్టడంతో బైక్పై వెళ్తున్న నలుగురు ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో వంద మందికి పైగా చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో కాకినాడ నుంచి అమరావతి వెళ్తున్నమంత్రి కురుసాల కన్నబాబు..తూరండి వద్ద ప్రమాదాన్ని చూసి కాన్వాయ్ ఆపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి.. క్షతగాత్రులను మరో వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి పంపించారు. అయితే బస్సులో ఉన్న చిన్నారులంతా క్షేమంగా బయటపడ్డారు.