క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సహకరించండి

Kshatriya Corporation Union Meets YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:రాష్ట్రంలో 30 నియోజకవర్గాలలో క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. క్షత్రియులలో వేలాది కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు పడుతున్నారు.  కొంత కాలంగా క్షత్రియులకు కార్పొరేషన్‌ కావాలన్న డిమాండ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని క్షత్రియ సమితులు, యువజన సంఘాలు, క్షత్రియ ఫెడరేషన్లు ఒకే మాటపై క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలకు వైఎస్సార్‌ పార్టీ తరఫున  కృషి చేయాలని అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి క్షత్రియ పోరాట సాధన సమితి తరఫున మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, జేఏసీ ప్రతినిధులు బి.శివాజీ, డి.పృథ్వీరాజ్, కె.రాజేష్‌వర్మ, ఎం.రాజేష్‌ తదితరులు ఆయనకు పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం జల్లూరులో వినతిపత్రం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top