'జగన్‌కు మద్దతిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకో'

'జగన్‌కు మద్దతిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకో'


చిత్తూరు: సీఎం పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కిరణ్ పార్టీ ఒక్క సీటు గెల్చిన రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. కిరణ్ పార్టీ పెట్టి అవమానం జరిగితే ఆయన రాష్ట్రాన్ని వదిలి బెంగళూరుకో, ఢిల్లీకో వెళ్లిపోవాల్సి వస్తుందన్నారు.



కిరణ్‌వన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను ఆయన నట్టేట ముంచారని విమర్శించారు. అనుభవం లేనప్పటికీ కిరణ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. జగన్‌కు మద్దతిచ్చి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కిరణ్కు పెద్దిరెడ్డి సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top