కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలంటూ.. 

KCR AP Fan prayers to Bezawada Durgamma - Sakshi

బెజవాడ దుర్గమ్మకు ఏపీకి చెందిన అభిమానుల పూజలు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమం): తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటూ విజయవాడకు చెందిన కేసీఆర్‌ అభిమాని శనివారం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపించారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ దుర్గగుడి ఘాట్‌ రోడ్డులోని కామథేను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 101 కొబ్బరి కాయలు కొట్టారు. విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన కొణిజేటి ఆదినారాయణ, ప్రకాశం జిల్లాకు చెందిన జి.లక్ష్మయ్య, తెలంగాణలోని నల్లగొండకు చెందిన ఉప్పునూతల నాగరాజు, సూరిని కార్తీక్‌రెడ్డితో పాటు పలువురు కేసీఆర్‌ అభిమానులు పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం కొణిజేటి ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేసీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లి వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే మన రాష్ట్రంలోని మైలవరం, రాజధాని పరిసరాల్లో వ్యాపారం చేసుకుంటే మాత్రం కొంత మంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ రెండోసారి ప్రమాణం చేసిన వెంటనే తన మొక్కులు తీర్చుకుంటానని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top