జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తాం...

Kapu Corporation Leaders Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్సార్‌సీపీ కడప జిల్లా కార్యదర్శి దాసరి శివప్రసాద్, షేక్‌ ఆఫాన్‌బాషా

విజయనగరం, ప్రజా సంకల్పయాత్ర బృందం: కాపు కార్పొరేషన్‌కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా కార్యదర్శి దాసరి శివప్రసాద్, షేక్‌ ఆఫాన్‌బాషా తెలిపారు. ముచ్చర్ల గ్రామ సమీపంలో మంగళవారం పాదయాత్ర సాగుతున్న సమయంలో వారు ప్లకార్డులతో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ నాలుగేళ్ల కాలంలో కేవలం రూ.360 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డిని తామంతా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా స్పందించిన ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పోరేషన్‌కు ప్రతి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే కాపు, బలిజ, వంటరి కులాలను తొమ్మిదో షెడ్యూల్డ్‌లో చేరుస్తామన్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతడ్ని ముఖ్యమంత్రిని చేసేవరకు సైనికుల్లా కష్టపడతామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top