వైఎస్‌ జగన్‌ కచ్చితంగా సీఎం అవుతారు: కళానిధి

Kalanidhi Rambabu Says YS Jagan Will Become Andhra Pradesh CM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస‍్కరించుకుని  ప్రముఖ జ్యోతిషుడు కళానిధి రాంబాబు రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అధ్యక్షుల జాతక ఫలాలను పరిశీలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎవరు అధికారంలో వస్తారనే దానిపై రాంబాబు తన అంచనాలను ప్రకటించారు. ఏపీలో ప్రముఖ పార్టీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, జనసేనలకు సంబంధించి లగ్నాలు, నక్షత్రాలు, రాశులు, పార్టీ ప్రారంభించిన తేదీ గడియాలను దృష్టిలో ఉంచుకుని రాంబాబు, జాతక రిపోర్టును వెల్లడించారు. 

ఆయన రిపోర్ట్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 110 సీట్లకు తక్కువ కాకుండా సీట్లు వస్తాయని.. ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని పేర్కొన్నారు. 17 ఏళ్లు వైఎస్‌ జగన్‌కు రాజయోగం ఉందని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గ్రహాలు అనుకూలంగా లేవని, ఆయనకు నిరాశ, నిసృహాలే అధికంగా కనబడుతున్నాయని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top