48వేల గ్రామీణ వైద్యులకు న్యాయం చేయండి
విశాఖపట్నం : వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో 429 జీవో ద్వారా రాష్ట్రంలో 48వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చారు. దీనిని 2012లో అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. 2018 మార్చిలో చంద్రబాబు 465 జీవో జారీ చేసినా ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత గ్రామీణ వైద్యులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామీణవైద్యుల జోన్ అధ్యక్షుడు జంగం జోషి, ప్రధానకార్యదర్శి ఐ.గోపి వినతిపత్రం అందించారు.