జన్మభూమి కమిటీల దోపిడీ
శ్రీకాకుళం: ‘అన్నా.. జన్మభూమి కమిటీల పేరుతో మంత్రి అచ్చె న్నాయుడు అనుచరులు దోచుకుంటున్నారు. ఇళ్లు, పెన్షన్లు, తిత్లీ నష్టపరిహారం, పనుల పేరుతో నిధులను మంత్రి అనుచరులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు.’ అని కోట బొమ్మాళి మండలం సౌదాం గ్రామానికి చెందిన చెట్టు దమయంతి జగన్తో చెప్పారు. మంత్రి అనుచరులు గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు కావాలంటే తాము చెప్పింది వినాలని బెదిరిస్తున్నారని తెలిపారు.