ఏపీలో ఐటీ అభివృద్ధికి చర్యలు: రఘునాథరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సివుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రూ. 36వేల కోట్ల ఎగుమతుల్లో కేవలం రూ. 700 కోట్లు మాత్రమే సీమాంధ్ర నుంచి వస్తోందని వెల్లడించారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలతో రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు కలిగిన అన్ని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తామని అంతకుముందు అన్నారు. హైదరాబాద్లోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటంతో విభజన సమయంలో ఇబ్బందులొచ్చాయన్నారు. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామన్నారు.