సాగునీటికి ప్రాధాన్యం

Important For Crop Water in Srikakulam - Sakshi

శ్రీకాకుళం  :‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత సాగునీటి వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పందలపాడు గ్రామానికి చెందిన నేను పాలకొండ పట్టణంలో జ్యూస్‌ షాపు పెట్టుకొని బతుకుతున్నాను.’ అని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పందలపాడుకు చెందిన కె.శివరామకృష్ణారెడ్డి జగన్‌కు తెలిపారు. పంటలు పండక ఇక్కడకు వచ్చానని, సాగునీటికి చర్యలు చేపడితే సొం త గ్రామంలో వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు.

ఏడు గ్రామాల సమస్య
‘అన్నా.. ఆమదాలవలస మున్సిపాలిటీ 6వ వార్డులో ఉన్న ఏడు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి’ అని పట్టణంలోని ఆరో వార్డు నాయకులు జగన్‌ను కోరారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి లో ఉన్న తమ గ్రామాలన్నీ శ్రీకాకుళం రూరల్‌ మండలంలో ఉన్నాయని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సనపలవానిపేట, కంచరాపువానిపేట గ్రామాలకు చెందిన ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వినిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top