పక్కా ఇళ్ల మంజూరే లేదు..

Homes Not Issued In This Government - Sakshi

విశాఖపట్నం:నాలుగేళ్లలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదని గాంధీనగరానికి చెందిన నూకాలమ్మ, అప్పల నర్స, సత్యవతి తదితరులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. గాంధీనగరం జంక్షన్‌లో వారు ఆయన్ని కలిశారు. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని, చాలా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top