డీఎస్సీలో హిందీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
నేను ఎంఏ హిందీ పండిట్ చేశాను. ప్రస్తుతం గెస్ట్ టీచర్గా చేస్తున్నాను. వైఎస్సార్ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. కాని టీడీపీ ప్రభుత్వం రెండు డీఎస్సీ నోటిఫికేషన్లలోనూ హిందీ పండిట్లను పూర్తిస్థాయిలో తీసుకోలేదు. ప్రభుత్వ పాuý శాలల్లో కనీసం ఇద్దరు హిందీ పండిట్లు ఉండాలి. చాలా పాఠశాలల్లో ఒక్కర్ని కూడా నియమించకుండా ఇతర సబ్జెక్ట్ టీచర్లతో హిందీ బోధిస్తున్నారు. అర్హత ఉన్న నాలాంటి నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు న్యాయం చేయాలి.
–బి.నాగమణి, మునగపాక