గుండె వ్యాధిగ్రస్తులకు పింఛను మంజూరు చేసి ఆదుకోండి
గుండె వ్యాధిగ్రస్తులకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కాకినాడకు చెందిన ఏసీ టెక్నీషియన్ ములపర్తి సాల్మన్ జగన్ను కోరాడు. కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలో జగన్ను కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు. తాను ఇప్పటి వరకు మూడుసార్లు గుండె వ్యాధికి గురికాగా ఆరోగ్యశ్రీ కాపాడిందన్నాడు. గుండె వ్యాధిగ్రస్తులు మునుపటి మాదిరిగా పనులు చేసుకోలేరని, తనలాంటి వారికి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
– ములపర్తి సాల్మన్, కాకినాడ