మీ నిర్ణయంతో ఆనందం
విశాఖపట్నం : మేం మధ్యతరగతి కుటుం బానికి చెందినవారం. మాకు పాప ఉంది. ఆ పాపకు ఉన్నంతలో మంచి చదు వు చెప్పించాలని ఆశిస్తున్నాం. ప్రైవేటు స్కూల్స్లో ఫీజులు చూస్తుంటే దడపుడుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బలపర్చాలనే మీ నిర్ణయం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు మీడియం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. అలాగే ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభిస్తే ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్వ వైభవం వస్తుందన్నా అంటూ అచ్యుతాపురం మండలం హరిపాలెంనకు చెందిన చింతకాయల నూకేశ్వరరావు–పద్మ దంపతులు హరిపాలెం వద్ద వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.– చింతకాయల నూకేశ్వరరావు–పద్మదంపతులు