స్వయం ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నా

Handicapped People Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : అన్ని ప్రభుత్వ సంస్థల్లో వికలాంగుల కోసం పది శాతం నిధులు కేటాయించాలని జీఓలో ఉన్నా కనీసం ఐదు శాతం కూడా కేటాయించకపోవడంతో దివ్యాంగులు స్వయం ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో వారు వైఎస్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్త నాగేశ్వరరావు, ఇంజారపు విజయబాబు, ఎం.సతీష్‌ తదితరులు తమ సమస్యలను వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top