దివ్యాంగురాలిపై వివక్ష
విజయనగరం : అన్నా మా పాప మౌనికకు ప్రస్తుతం 8 ఏళ్లు. పుట్టినప్పటి నుంచి నడవలేకపోతోంది. ఎన్నో ప్రభుత్వాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. నడవలేని పాపకు సదరం సర్టిఫికెట్ కోసం వెళ్తే 40 శాతం వైకల్యం ఉన్నట్టు నిర్థారించారన్నా. పింఛన్ కూడా రూ.1500 కాకుండా.. రూ.వెయ్యి ఇచ్చి వివక్ష చూపుతున్నారు.. అంటూ గజపతినగరం మండలం జిన్నాం గ్రామానికి చెందిన బంకపల్లి పైడితల్లి మొర పెట్టుకుంది. మీ ప్రభుత్వం వస్తే దివ్యాంగులకు ఇస్తామన్న రూ.3 వేలు హామీ తప్పక నేరవేర్చాలన్నా.. అని కోరింది.
సంబంధిత వార్తలు