గ్రూప్–2 వివరాల సవరణకు గడువు 31
సాక్షి, అమరావతి: గ్రూప్–2–2016 నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థులు తమ వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకొనేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పోస్టు, జోన్, జిల్లా వివరాలకు సంబంధించి పొరపాట్లు జరిగి ఉంటే సరిచేసుకోవచ్చని వివరించింది.
ఇందుకు ఆప్షన్ల మార్పునకు వెబ్సైట్లో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇలా ఉండగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల లైబ్రేరియన్ల ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. దీంతోపాటు భూగర్భ జలవనరుల విభాగంలోని టెక్నికల్ అసిస్టెంటు పోస్టుల భర్తీ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేసింది.