టాయిలెట్ వెళ్తా అని అడిగినందుకు...
విద్యార్థిపై ఉపాధ్యాయురాలి ప్రతాపం
కాళ్లు, చేతులు, ముఖంపై దెబ్బలు
సాక్షి, వేజండ్ల (చేబ్రోలు): టాయిలెట్కు వెళ్లాలని విద్యార్థి పదేపదే అడుగుతున్నాడని ఆగ్రహానికి గురైన ఉపాధ్యాయురాలు కర్రతో బాదడంతో బాలుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలో చోటుచేసుకుంది.
వేజండ్ల గ్రామంలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న షేక్ అలీ టాయిలెట్కు వెళ్లాలంటూ ఎక్కువ సార్లు అడుగుతున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు పార్వతి అలీని కర్రతో చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో బాలుడి శరీరంపై వాతలు తేలాయి. సాయంత్రం ఇంటికొచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాఠశాలకు వెళ్లి టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాలుడి తండ్రి కిఫాయిత్ చెప్పారు.