శభాష్‌ టీచర్‌ !

Government School Head Master Joins Hes Children In Govt School In Chittoor - Sakshi

పెద్దపంజాణి: మండల పరిధిలోని గౌరీనగర్‌ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కుమారుడు హేమంత్‌ను 9వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలోను, కవల పిల్లలైన కుమార్తెలను ఆరో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో సోమవారం చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధిస్తున్నారని, అందుకే తన ముగ్గురు పిల్లలను రాయలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేర్పించానని తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం నారాయణ, ఇతర ఉపాధ్యాయులు ఆయన్ను అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top