కన్నీరే మిగిలింది
శ్రీకాకుళం: ‘పాప పుట్టిందన్న ఆనందం మాకు ఎంతో సేపు మిగల్లేదన్నా. పాపకు పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడిపోయాయి’ అంటూ ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన కొత్తకోట శైలజ జగన్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు. తన కూతురు బుద్ధి మాంధ్యంతో ఇబ్బందులు పడుతోందని, కనీసం కదలడం కూడా చేతకావడం లేదని చెప్పారు. పదేళ్లుగా నరకం చూస్తోందని, ఇలాంటి పిల్లల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ఆమె ప్రతిపక్ష నేతను కోరారు.