ఆర్థికలోటు పెరుగుదల ఇబ్బందికరం: యనమల
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆర్థికలోటు రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఆర్థికలోటు పెరుగుదల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందన్నారు. అవసరమైతే వివిధ మార్గాల్లో అప్పులు చేసైనా సరే రాష్ట్రాన్ని ముందుకు నడిపించవలసిన అవసరం తమపై ఉందన్నారు.