పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుంది : బుగ్గన

Finance Minister Buggana Rajendranath Toured in Yemmiganur - Sakshi

సాక్షి, కర్నూలు : గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్ని సమస్యలున్నా అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top