వివాహానికి వెళ్లొస్తూ.. తండ్రీకొడుకుల మృతి
సాక్షి, అనంతపురం : వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పావగడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రామాంజనేయులు, ప్రతాప్లు ఓ వివాహానికి హాజరై బైక్పై తిరిగి వస్తుండగా ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.