ఆదర్శ రైతులకు అన్యాయం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా నియమించిన ఆదర్శ రైతులకు ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అనంతపురం జిల్లా ఆదర్శ రైతులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమశేఖర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, మహానందరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, బోయ లక్ష్మీనారాయణ, తిరుపాల్రెడ్డి తదితరులు గురువారం పాదయాత్రలో భాగంగా కందుకూరుకు చేరుకున్న వైఎస్ జగన్ను కలిశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శ రైతులను తిరిగి నియమించాలని కోరారు. 2019లో వైఎస్సార్సీపీ విజయానికి ఆదర్శ రైతులంతా కృషి చేస్తామని చెప్పారు.