గీత కార్మికులకు స్థలాలు కేటాయించాలి

Farmers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : గీత కార్మికులకు స్థలాలు కేటాయిస్తే తాడి, ఈత చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తామని అచ్యుతాపురం మండలం చోడపల్లి గీత కార్మికులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ఈ ప్రాంతంలో సెజ్‌లు రావడం వల్ల భూ సేకరణ జరగడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయామన్నారు. చాలా మంది అర్హులైన వారు ఉన్నా పింఛన్లు కూడా ఇవ్వడం లేదని జననేత వద్ద వాపోయారు. పాదయాత్రగా జగన్‌తో నడిచి ఈ కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడంతో సానుకూలంగా స్పందించిన జగన్‌ మనందరి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతోనే తమ సమస్యలు గట్టెక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.– జగన్‌ను కలిసిన చోడపల్లి గీత కార్మికులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top