గీత కార్మికులకు స్థలాలు కేటాయించాలి
విశాఖపట్నం : గీత కార్మికులకు స్థలాలు కేటాయిస్తే తాడి, ఈత చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తామని అచ్యుతాపురం మండలం చోడపల్లి గీత కార్మికులు జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ఈ ప్రాంతంలో సెజ్లు రావడం వల్ల భూ సేకరణ జరగడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయామన్నారు. చాలా మంది అర్హులైన వారు ఉన్నా పింఛన్లు కూడా ఇవ్వడం లేదని జననేత వద్ద వాపోయారు. పాదయాత్రగా జగన్తో నడిచి ఈ కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడంతో సానుకూలంగా స్పందించిన జగన్ మనందరి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతోనే తమ సమస్యలు గట్టెక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.– జగన్ను కలిసిన చోడపల్లి గీత కార్మికులు