సాగునీరు అందించాలి
శ్రీకాకుళం: అన్నా.. పెన్నా నది నీటి జలాలను మా ప్రాంత పంట భూములకు అందించాలి. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలో భూములన్నీ వర్షాధారంగా సాగుచేస్తున్నాం.’ అని కడపకు చెందిన ఇందిరెడ్డి శంకరరెడ్డి జగన్కు తెలిపారు. తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న పెన్నా నది నీటిని చెరువులకు నీరు మళ్లిస్తే పంటభూములు సస్యశ్యామలమవుతాయని చెప్పారు.