ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు..
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్ల తన లాంటి పేదలు సరైన వైద్య చికిత్సలు పొందలేకపోతున్నట్లు జగన్ ఎదుట కందుకూరు చెందిన టైలర్ అక్కులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులతో సహ కందుకూరులో ఆయన జగన్ను కలిసి మాట్లాడారు. కిడ్నీలు చెడిపోయి ఆరోగ్యం క్షీణిస్తోందని, ప్రతి నెలా మందులక, డయాలసిస్కు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతోందని వివరించారు. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్ధరించాలని వేడుకున్నారు.